ప్రముఖ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ అంకుల్స్ చిత్రం ట్రైలర్ విడదలై చిత్రంపై మరింత అంచనాలు పెంచింది. ప్రముఖ గాయకుడు మనో క్రేజీ అంకుల్స్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేస్తున్నారు అలాగే రాజా రవీంద్ర మరియు భరణిలతో ప్రధాన పాత్రలో నటిస్తన్నారు. శ్రీముఖి పాత్ర ఉల్లాసంతో యవ్వనంగా ధైర్యంగా వినోదభరితంగా తీర్చిదిద్దారు. క్రేజీ అంకుల్స్ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. వారి భార్యలతో సంతృప్తి చెందని, మనో, రాజా రవీంద్ర మరియు భరణీ పోషించిన పాత్రలు నటి శ్రీముఖి చుట్టూ తిరుగుతూ మరింత వినోదభరితంగా ఉంది ట్రైలర్.రాజు, రెడ్డి, రావు ఆర్ఆర్ఆర్ పాత్రలు సినిమా పై మరింత ఆసక్తి తీసుకువచ్చారు. సత్తి బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, బోడు అశోక్ సహకారంతో గుడ్ ఫ్రెండ్స్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి సరదా అల్లర్లను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ చిత్ర బృందం.