నటి రేణు దేశాయ్ త్వరలో రైతులు గురించి ఒక మంచి కథతో చిత్రం తీస్తున్నారు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు అని తెలుస్తోంది. తను మొట్టమొదటి స్ట్రెయిట్ గా తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఆమె ఈ అంశంపై చాలా పరిశోధనలు చేసారు అని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభం కావాల్సి ఉంది కానీ లాక్డౌన్ కారణంగా అకస్మాత్తుగా ఆగింది. ఇప్పుడు షూటింగ్ నెమ్మదిగా ప్రారంభమవుతున్న తరుణంలో, రేణు కూడా తన ప్రాజెక్ట్ పై ప్రీ ప్రొడక్షన్ పనులను తిరిగి ప్రారంభించారు. అయితే కొద్ది రోజుల క్రితం రేణు దేశాయ్ తెలంగాణ కవి, గేయ రచయిత గోరెటి వెంకన్నను తన ఫామ్హౌస్లో కలుసుకుని, ఆమె ప్రాజెక్ట్ కోసం సాహిత్యం గురించి చర్చించారు అని తెలుస్తోంది. షూటింగ్ ఫార్మాలిటీల గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ చిత్రం తరువాత, చేనేత చేనేత కార్మికుల దుస్థితిపై మరో సినిమా తీయాలని రేణు యోచిస్తున్నట్లు సమాచారం.
ఆమె ఇన్స్తా గ్రామ్ లో ఈ విధంగా పోస్ట్ పెట్టారు. గోరెటి వెంకన్న గారు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాను. వెంకన్న గారు నేను రైతుల పై తీస్తున్న చిత్రానికి ఒక పాట రాస్తున్నందుకు నాకు చాలా గౌరవం అనిపిస్తుంది. వెంకన్న గారి భార్య మట్టి పాత్రలలో రుచికరమైన అన్నం పప్పు మరియు రుచికరమైన రోటీ పచాడీని చేసి పెట్టారు. నాకు పువ్వులు బహుమతిగా ఇచ్చే బదులు, నా భోజనం తినడానికి గోరేటి గారు నాకు అరటి ఆకును బహుమతిగా ఇచ్చారు. వారితో గడిపిన సమయం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.