సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మజీ ఇటీవల కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) నిధికి రూ .75,000 విరాళం ఇచ్చారు. మరోవైపు, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ క్లిష్ట సమయాల్లో సహాయం అందించని నటీమణుల పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మన తెలుగులో చాలా మంది ప్రముఖ నటిమనులు ముంబైకి చెందినవారు ఉన్నారు వారికి తెలుగులో అధిక పారితోషికం లభిస్తోంది. వారికి టాలీవుడ్ లో స్టార్డమ్ ఎక్కువ , లావణ్య త్రిపాఠి ప్రణీత సుభాష్ వంటి నటీమణులు తప్ప ఈ ఛారిటీ చొరవపై ఎవరూ స్పందించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అని బ్రహ్మాజీ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికతో ఒక సంభాషణలో అన్నారు.
కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అధిక పారితోషికాలు వసూలు చేస్తున్నారని, సంక్షోభం వచ్చినప్పుడు వారు స్పందించాలని బ్రహ్మజీ అన్నారు. మీరు లక్షల రూపాయలు విరాళం ఇవ్వవలసిన అవసరం లేదు, కానీ మీరు ఈ స్వచ్ఛంద సంస్థ కోసం కనీసం కొన్ని వేల ఖర్చు చేయవచ్చు అని బ్రహ్మజీ అన్నారు.
బ్రహ్మాజీ ఒక్కరే కాదు చాలా మందిలో ఈ డౌట్ ఉంది ఎందుకు వీరు సాయం చేయడానికి ముందుకురావటం లేదు అని.
చిత్ర పరిశ్రమ లక్డౌన్ బాధితుడి ఆవేదన ఇలా ఉంది..
పవన్ కల్యాణ్ కి కొందరి ప్రముఖులు కి మద్య వుండే వెత్యాసం. కరోనా రాకుండా చేతులు ఎలా కడుకోవలో వీడియోల మీద వీడియోలు పెటేస్తునారు కొందరు ప్రముఖులు ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి. అదే చేతులు కడుకుని తినడానికి తిండికి కావలసిన డబ్బులు లేక పేద కుటుంబాలు బయటకు వస్తుంటే వీరికి బాధ్యత లేదని పోస్ట్లు మీద పోస్ట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో మరి కొందరు,ఎందుకంటే కొందరికి తినడానికి తిండి లేక వుండటానికి నివాసం లేక ఎక్కడినుంచో వలస వచ్చి ఇబ్బంది పడుతున్నారు. బయట అటువంటి వారిని ఆదుకోవటానికి నీవు ఎంత అమౌంట్ సహాయం చేశావ్. ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా ఉచిత సలహాలు ఎలా ఇస్తవ్ నువ్వు. అటు వంటి వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఉచిత సలహలు మాత్రం చెపుతారు కొందరు. చాలా మంది పొట్ట కూడు కోసం వేరే ప్రాంతాలకు వచ్చిన వారు కూడా వుంటారు. వాళ్ళు వుండటానికి నివాసం లేక కాలు నడకన తన సొంత ఊరికి పోవడానికి వెనకాడటం లేదు. సినీ పరిశ్రమ చాలా పెద్దది అందులో హీరో ఒక్కడే వుంటాడా హీరోయిన్స్ ఉండరా వాళ్ళు సాలరీస్ తీసుకోరా పేదవాడి కోసం ఒక లక్ష రూపాయలు సహాయం చేయలేరా పవన్ కళ్యాణ్ ప్రభాస్ లాంటి వాళ్ళు ముందు కొచ్చి కోట్లు ఇస్తుంటే వీళ్ళు మాత్రం ఉచిత కరోనా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్త వీడియోలు చేస్తూన్నారు. వీడియోలు చెయ్యదు అంట్లే నువ్వు సొంతగా సంపాదించినా ఆస్తిలో కరోనా ఆపదలో ఉన్న వారికి ఎంత సహాయం చేశావ్ అంటున్న. పవన్ కళ్యాణ్ ప్రభాస్ లాంటివాళ్ళు చేతులు ఎలా కడుకోవలో చెప్పట్లేదు. పేద కుటుంబంలను ఆర్థికంగా ఆదుకుని ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటువంటి వాళ్ళు చెప్తే ప్రజలు నిజంగా వింటారు. జై హింద్
