విజయ్ దేవరకొండ త్వరలో పూరి జగన్ చిత్రంతో హిందీలో అడుగుపెడుతున్న విషయం అందరికి తెలిసిందే, ఈ చిత్రం ఇప్పటివరకు ముంబైలో 40% షూట్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నటి అనన్య పాండే విజయ్ కి జంటగా నటించబోతోంది.
ఈ చిత్రం విడుదలైన తర్వాత, విజయ్ కి ఖచ్చితంగా హిందీలో ఎక్కువ ఆఫర్స్ రావడం కాయం అయితే విజయ్ దేవరకొండ ని ఏ హీరోయిన్తో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు అని అడిగినప్పుడు, విజయ కియారా అద్వానీ మొదటి ఆప్షన్ అని సందేహం లేకుండా సమాధానం ఇచ్చాడు. జాన్వి కపూర్ పేరును కూడా సెకండ్ ఆప్షన్ గా జోడించాడు. అయితే జాన్వి కపూర్ పూరి చిత్రంలో విజయ్ తో రొమాన్స్ చేయాల్సి ఉంది, కానీ ఆమెకు డేట్స్ కుదకపోవడంతో, ఆ పాత్ర అనన్యకు వెళ్ళింది.
