మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో మందికి ఆయన ఒక మార్గదర్శి తెలుగు సినిమాలోకి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఆయన స్పూర్తి గా తీసుకుని వచ్చిన వాళ్ళే. చాలా మందికి ప్రేరణగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలోకి వచ్చి ఈ రోజుతో 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు ఈ చిత్రం సెప్టెంబర్ 22 అంటే ఇదే రోజు విడుదల అయ్యింది. చిరు స్వయంగా సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేసి, అభిమానులకు ఒక నోట్లో కృతజ్ఞతలు తెలుపుతూ, తన చిత్రాలు వల్లనే ఇంత భారీ అభిమానాన్ని పొందానని ఇంతా ఆప్యాతచూపిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం చిరు శివ కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
#BornAsAnActor #ForeverGrateful #PranamKhareedu #thisdaythatyear pic.twitter.com/lKM1qQhpN9
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2020
