అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం ఇప్పుడు లాక్డౌన్ నిబంధనలు ఇంకా ముగియకపోవడంతో, పుష్ప నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అంటా దాని కోసం, గోదావరి ప్రాంతంలో సెట్లు వేయడం వంటి పనులు జరుగుతున్నాయి అంటా ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే, కేరళలో షూట్ చేద్ధం అనుకున్న పనులు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో, మారేడుమిల్లి అడవి ప్రాంతంలో షూట్ చేయడం కోసం అక్కడ రోడ్లు వేస్తున్నారు అంటా పుష్ప చిత్ర బృందం. ఈ షూట్ కారణంగా అక్కడ రోడ్లు అలాగే పరిసర ప్రాంతాలు మరింత మెరుగుపడుతున్నందున ఇది శుభ పరిణామం అనే చెప్పాలి.ఎందుకంటే షూటింగులు లకు అనుకూలంగా పనులు జరగడం వల్ల మరింత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది అని అక్కడవారి ఆలోచన అంటా. అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఈ సెట్లు జరుగుతున్నాయి అని సమాచారం. ఈ కథకు సంబంధించి చేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించాలి కాబట్టి సౌకర్యవంతంగా ఉండటానికి వారు రోడ్ రిపేర్ పనులు చేస్తున్నారు అని సమాచారం.
కేరళ అడవిలో కాదు మారేడుమిల్లి అడవిలో షూట్?
