Site icon syeraa

కష్ట సమయంలో ఆదుకున్నవడే అసలైన నాయకుడు

పవన్ కళ్యాణ్ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో సాధారణ సమయంలో కంటే ఇప్పుడు చాలా చురుకుగా ఉన్నారు. అతను ఈ లాక్డౌన్ను చాలా బాధ్యతగా తీసుకున్నాడు అలాగే కరోనావైరస్ మహమ్మారితో పోరాడటానికి అలాగే అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తున్నాడు.

మొట్ట మొదటి గా కరోనా బాధితులు కోసం బారి విరాళం ఇచ్చిన విధానం ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది, ఏప్రిల్ 3 అంటే ఈ రోజు తన అభిమనులకు ప్రతి ఒక్కరినీ పిఎం రిలీఫ్ ఫండ్ తమ వంతు సాయంగా విరాళం ఇవ్వమని కోరారు. అలాగే ఇతర రాష్ట్రాల ప్రతినిధులను వాళ్ళ రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన కోరిన విధానం చాలా మంది నుండి ఆయనకు మంచి ప్రశంసలను వస్తున్నాయి. అదే విధంగా అమెరికా లో చిక్కుకున్న తెలుగు వారిని ఆదుకోవలసిందిగా కేంద్ర ప్రభత్వానికి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేంద్రం నుంచి స్పందన రావడంతో వారికి కృజ్ఞతలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ కి బిజెపితో మంచి సన్నిహితం ఉండటంతో, అతని పోరాటం మరింత దూకుడుగా మారింది. అయితే సాధారణ ప్రేక్షకులు మరియు అభిమానులు అభిప్రాయం ఏమిటి అంటే పవన్ ముందు నుండి నాయకత్వం వహిస్తున్నారని అలాగే ఈ పరీక్షా సమయాల్లో పనిలేకుండా కూర్చొని ఉన్న అనేక మంది నాయకుల కంటే మెరుగ్గా ఉన్నారని పవన్ పట్ల సంతోషంగా ఉన్నారు.

Exit mobile version