ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా తన సాహో మూవీ టీజర్ ను పెట్టీ ఈ రోజు తో వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు, ప్రభాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చిన చిత్రం సాహో, బారి అంచనాలు మధ్య భారతదేశం అంతటా విడుదలైంది. ఈ చిత్రం నటుడి తెలుగు అభిమానుల అంచనాలను చేరుకోవడంలో విఫలమైనప్పటికీ, ఇది ఉత్తర భారతదేశంలో అతని అభిమానులను ఆకర్షించగలిగింది. ఈ రోజుతో సాహో మొదటి వార్షికోత్సవం సందర్భంగా, ప్రభాస్ ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులందరికీ స్టైలిష్ కొత్త లుక్ తో కృతజ్ఞతలు తెలిపారు. నా డైహార్డ్ అభిమానులకు అలాగే నా సాహో జట్టుకు, మీ ప్రేమకు మద్దతుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘ రాధేశ్యామ్’ అనే లవ్ స్టొరీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన తొలిసారి హీరొయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.
