Site icon syeraa

జగదేకవీరుడు అతిలోకసుందరి అద్భుత చిత్రం గురించి

మెగాస్టార్ చిరంజీవి గారు 90 స్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ గురుంచి తన పాత జ్ఞాపకాలను తలచుకొంటూ, ఈ చిత్రం అందరి కృషి వలనే అంతా పెద్ద హిట్ అయింది అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అశ్వని దత్ గారు నిర్మాతగా శ్రీదేవి కథానాయికగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గురుంచి అశ్వని దత్ గారు కూడా ఈ మూవీ గురుంచి అదే విధంగా సీక్వెల్ గురించి మాట్లాడారు.

మే 9, 1990 న విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి, మెగాస్టార్ చిరంజీవి అతిలోక సుందరి శ్రీదేవి యొక్క కలయికలో ఐకానిక్ సోషల్-ఫాంటసీ చిత్రం. ఈ బ్లాక్ బస్టర్ చిత్రం రెండు దశాబ్దాల ప్రయాణాన్ని మరో రెండు రోజుల్లో పూర్తి చేసుకోనుంది.

అయితే జగదేక వీరుడు అతిలోకా సుందరి సీక్వెల్ గురించి గతంలో చాలా సార్లు పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, చిత్ర నిర్మాత అశ్విని దత్ క్రేజీ సీక్వెల్ వుంటుంది అని ధృవీకరించారు. జగదేక వీరుడు ఖచ్చితంగా సీక్వెల్ రూపంలో తిరిగి వస్తాడు అని ఆ ప్రాజెక్ట్ తర్వాతే నేను సినిమాల నుండి రిటైర్ అవుతాను అని అశ్విని దత్ అన్నారు.

అశ్విని దత్ గారు ప్రస్తుతం ప్రభాస్ 21 నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు, దీనిని అతని కుమార్తెలు ప్రియాంక మరియు స్వాప్నా నిర్మిస్తున్నారు.

Exit mobile version